త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబుల కలయికలో తెరకెక్కిన అతడు సినిమా 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. త్రిష హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించగా నాజర్, తనికెళ్ల భరణి, సునీల్, ప్రకాష్ రాజ్, గిరిబాబు, సోనుసూద్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు చేసిన పెర్ఫార్మన్స్ కు ఆడియన్స్ నుంచి మంచి పేరు లభించింది. ఇక ఆ తరువాత మరొకసారి కొంత గ్యాప్ అనంతరం త్రివిక్రమ్ తో మహేష్ చేసిన సినిమా ఖలేజా. అనుష్క శెట్టి హీరోయిన్ గా సింగనమల రమేష్ బాబు, సి కళ్యాణ్ నిర్మాతలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో మహేష్ బాబు సీతారామరాజు అనే టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు. ఇక అసలు విషయం ఏమిటంటే అతి త్వరలో మరొకమారు సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై మహేష్, సూర్యదేవర రాధాకృష్ణ దీనిని ఎంతో భారీగా నిర్మించనున్నట్లు టాక్.

ఇప్పటికే ఈ మూవీ కోసం ఒక అద్భుతమైన స్టోరీ లైన్ సిద్ధం చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్ట్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది . కాగా ఈ ప్రతిష్టాత్మక సినిమా ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనుందని కొందరు అంటుండగా అదేమీ లేదు డైరెక్ట్ తెలుగులో మాత్రమే ఈ మూవీ విడుదల అవుతుందని మరికొందరు అంటున్నారు. అయితే దీని పై పూర్తి స్థాయిలో స్పష్టత రావాలి అంటే దర్శక నిర్మాతల నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: