తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి.. స్మాల్ స్క్రీన్‌తో పాటు బిగ్‌ స్క్రీన్ పై కూడా తళుక్కుమన్న తార సురేఖావాణి, చక్కటి అందంతో పాటు ఆకట్టుకునే నటన ఈమె సొంతం. సినిమాల్లో అడపదడపా కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించే సురేఖా వాణి, అటు సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా అదరగొడుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆ మధ్య సురేఖావాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

దీంతో స్వయంగా ఈ విషయంపై సురేఖావాణి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన స్పష్టతనిచ్చారు.అలాంటిదేమి లేదని అదంతా ఫేక్ న్యూస్ అంటూ పేర్కోన్నారు. తాజాగా సురేఖావాణి ఈటీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న అలీతో సరదాగా అనే టాక్ షోకు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాదానాలు చెబుతూ తన పెళ్లి విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ షోకు సురేఖా వాణి మరో సీనియర్ నటి రజితతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా అలీ రెండో పెళ్లి గురించి ప్రశ్నించగా సురేఖావాణి తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేశారు.

 తాను చేసుకోబోయే వ్యక్తి ఎవరో కూడా మీరే చెప్పాలని సురేఖావాణి తన రెండోపెళ్లి గురించి ప్రచారం చేసేవాళ్లను ప్రశ్నించారు. ఒక వేళా తాను రెండో పెళ్లి చేసుకుంటే డబ్బున్న వాడినే చేసుకుంటానని వ్యంగ్యంగా తెలిపారు. అయితే ఆ తరువాత అలీ మనస్సు ముఖ్యమా..? డబ్బు ముఖ్యమా..? అని తిరిగి సురేఖావాణిని ప్రశ్నిస్తే మనస్సుతో పనులు జరగవని అర్థమైందని.. రక్తం గడ్డ కట్టడంతో తన భర్త చనిపోయారని భావోద్వేగం చెందుతూ తెలిపారు. ఈ విషయంలో నన్ను నా కూతురుని బ్లేమ్ చేశారని..అంతేకాదు ఆపదలో ఉన్నప్పుడు భర్త తరుపునుంచి ఎవరు రాలేదని కూడా చెప్పుకొచ్చింది సురేఖా వాణి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: