పోర్న్ వీడియోలతో పాపులర్ అయిన సన్నీ లియోన్ కెనెడా దేశస్థురాలు . అయితే సినిమాల్లో అవకాశాలు వచ్చాక మాత్రం సన్నీలియోన్ పోర్న్ వీడియోలకు గుడ్ బై చెప్పింది . అప్పటి నుండి ఇండియాలోనే ఉంటూ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా వుంది . హిందీలోనే కాక తెలుగు, తమిళ భాషల్లో సైతం సన్నీలియోన్ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఇక ప్రస్తుతం సన్నీ లియోన్ రంగీలా , షెరో అనే సినిమాల్లో నటిస్తోంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే సన్నీ తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది . కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సన్నీ లియోన్ ఎన్నో సేవాకార్యక్రమలు చేసి ఆదర్శంగా నిలిచింది . అంతే కాకుండా ప్రస్తుతం తనకు కుమారుడు ఉన్నప్పటికీ సన్నీ ఓ అనాథ బాలికను దత్తతు తీసుకుని సొంత బిడ్డలా చూసుకుంటుంది . ఇదిలా ఉండగా తాజాగా మరోసారి సన్నీ లియోన్ తన ఉదారత చాటుకుంటు వార్తల్లో నిలిచింది . 

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణతో ఢిల్లీలో లాక్ డౌన్ విధించారు. దాంతో వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. అయితే వాళ్ళ కోసం సన్నీ రంగంలోకి దిగి వారి కడుపు నింపుతోంది. దాదాపు 10వేల మంది కార్మికులకు సన్నీ ఆహారం పెడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని పెటా "పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యనిమాల్స్" ఇండియా అనే సంస్థతో కలిసి నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన సన్నీ లియోన్ "ప్రస్తుతం మనం కరోనా సంక్షోభాన్ని ఎదురుకుంటున్నాం. ఇలాంటి సమయంలో కరుణ, జాలి తో ఇతరులకు సహాయం చేయాలి. ప్రస్తుతం పేటా తో పనిచేయడం చాలా సంతోషం గా ఉంది." అంటూ సన్నీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: