ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అయితే దీని తరువాత తన తదుపరి మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నారు సూపర్ స్టార్. ఇటీవల దీని యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రా ఏజెంట్ గా నటిస్తున్నారని, అలానే ఈ మూవీ కి టైటిల్ గా పార్ధు అనే పేరును యూనిట్ ఫిక్స్ చేసిందని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో పలువురు త్రివిక్రమ్ టీమ్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ఈ మూవీని అధికారికంగా కృష్ణ జన్మదినమైన ఈ నెల 31న ప్రారంభిస్తారని, ఆ రోజున మూవీ కి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని వారు చెప్పినట్లు తెలుస్తోంది....!!