సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే ఒక షెడ్యూల్ ని దుబాయ్ లో జరుపుకుంది. కాగా ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ ని ఇటీవల హైదరాబాద్ లో మొదలెట్టారు. అయితే హఠాత్తుగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో సర్కారు వారి పాట యూనిట్ షూట్ ని నిలుపుదల చేసింది. అలానే టీమ్ లోని కొందరికి కొవిడ్ పాజిటివ్ రావడంతో ఆ వెంటనే మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి హోమ్ ఐసోలేషన్ లో ఉండిపోయారు. ఇక ఈ సినిమాని పరశురామ్ తీస్తుండగా ఎస్ థమన్ సంగీతాన్ని, మది ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా ఇటీవల మన భారతీయ బ్యాంకులను కుదిపేసిన పలు కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్.

ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అయితే దీని తరువాత తన తదుపరి మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నారు సూపర్ స్టార్. ఇటీవల దీని యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రా ఏజెంట్ గా నటిస్తున్నారని, అలానే ఈ మూవీ కి టైటిల్ గా పార్ధు అనే పేరును యూనిట్ ఫిక్స్ చేసిందని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో పలువురు త్రివిక్రమ్ టీమ్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ఈ మూవీని అధికారికంగా కృష్ణ జన్మదినమైన ఈ నెల 31న ప్రారంభిస్తారని, ఆ రోజున మూవీ కి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని వారు చెప్పినట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: