ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతుండడంతో అన్ని సినిమాలతో పాటు తమ సినిమా షూట్ ని కూడా సర్కారు వారి పాట యూనిట్ ఇటీవల ఆపేసింది. అందుతున్న న్యూస్ ప్రకారం ఈ పరిస్థితులు అదుపులోకి వచ్చిన వెంటనే మూవీ షూట్ ని వేగంగా కంప్లీట్ చేయనున్నట్లు టాక్. అలానే దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ యొక్క షూట్ జులై లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
అయితే లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం అటు సర్కారు వారి పాట తో పాటు ఇటు త్రివిక్రమ్ మూవీ షూట్ కూడా ఒకేసారి చేసేలా సూపర్ స్టార్ మహేష్ డబుల్ ప్లాన్ సిద్ధం చేసారని, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి సర్కారు వారి పాట ని అలానే సమ్మర్ కి త్రివిక్రమ్ మూవీ ని రిలీజ్ చేయాలని ఆయన సంకల్పించారట. మరి ఇది కనుక వర్కౌట్ అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి వచ్చే ఏడాది డబుల్ ట్రీట్ ఖాయం అనే చెప్పాలి..... !!