టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో కొనసాగుతున్న సక్సెస్ఫుల్ దర్శకుల్లో కొరటాల శివ కూడా ఒకరు. తొలిసారిగా ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మిర్చి మూవీ ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన కొరటాల శివ, ఆ మూవీ తో పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఆపై ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు మూవీ తీసి ఆ మూవీ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కొరటాల, అనంతరం ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, అలానే మరొక్కసారి మహేష్ తో భరత్ అనే నేను మూవీస్ తీసి మరొక రెండు విజయాలు అందుకున్నారు.

ఇక ప్రస్తుతం మెగాస్టార్, మెగా పవర్ స్టార్ లతో ఆచార్య మూవీ తీస్తున్న కొరటాల శివ, దీనిని కూడా పక్కాగా సక్సెస్ చేసేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో మెగాస్టార్ ఒక మాజీ నక్సలైట్ గా కనిపించనుండగా ఆయన అనుచరుడైన సిద్ద పాత్ర లో చరణ్ కనిపించనున్నారు. ఈ మూవీ ఈ నెల 13న విడుదల కావలసి ఉండగా కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమాని కొన్నాళ్ల పాటు వాయిదా వేసింది యూనిట్. ఇక దీని తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తీయనున్నారు కొరటాల. ఇటీవల దీని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ మూవీ అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కొరటాల ఒక భారీ కమర్షియల్ మూవీ తీయనున్నారని, ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించనుందని టాక్. ఇప్పటికే చరణ్ కి ఒక అద్భుతమైన స్టోరీ వినిపించిన కొరటాల అది ఆయనకు ఎంతో నచ్చడంతో ప్రస్తుతం స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ తో కొరటాల ఒక మూవీ ప్లాన్ చేసారు, దాని ప్రారంభోత్సవం కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన అది సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. మొత్తంగా ఎట్టకేలకు ఇప్పటికి కొరటాలతో చరణ్ మూవీ ఫిక్స్ అవ్వడంతో వీరి కాంబో మూవీ సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే దీనిపై అధికారికంగా న్యూస్ మాత్రం బయటకు రావలసి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: