ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో కరోనా ఎక్కువగా సెలబ్రిటీలపై పగబట్టనట్లుంది. ఒకరితరువాత మరొకరుగా వరుసగా కరోనా బారిన పడుతున్నారు అనేకమంది సెలబ్రిటీలు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో ప్రముఖులు కరోనా బారిన పడి మరణించారు. మరికొంతమంది ఇప్పటికీ ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. వారిలో హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు అంతా ఉన్నారు. ఇక ఇటీవలి కాలంలో స్టార్ హీరోయిన్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆండ్రియా జెరెమియా కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టు సమాచారం. కరోనా లక్షణాలు సాధారణంగానే ఉండడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటోందట. వైద్యుల సలహాలు తీసుకుంటూ కరోనా నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోందట. ఈ క్రమంలోనే ఆండ్రియా కరోనా నుంచి బయటపడాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ‘గెట్ వెల్ సూన్’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆండ్రియా.. తాజాగా ఇలయదళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘మాస్టర్’ చిత్రంలోనూ కీలక పాత్రలో నటించింది. అనేక సినిమాల్లో నటించింది. తెలుగులో నాగచైతన-సునీల్ కాంబోలో వచ్చిన తడాఖా సినిమాలో నటిస్తోంది. ఆ తర్వాత కోలీవుడ్‌కే పరిమితమైపోయింది. ఆమె నటించిన విశ్వరూపం వంటి తమిళ సినిమాలు తెలుగులో కూడా భారీ విజయాలను నమోదు చేశాయి.

ఇదిలా ఉంటే ఇటీవల టాలీవుడ్ హీరోయిన్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మొదట రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. ఆ తర్వాత తమన్నా భాటియా, తాజాగా పూజా హెగ్దేలు కరోనా బారిన పడ్డారు. అయితే వీరంతా కరోనా నుంచి కోలుకున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లు ఆలియా భట్, దీపికా పదుకొణేలు కూడా కరోనా బారిన పడ్డారు. కోలీవుడ్‌లో కొంతమంది హీరోలు, హీరోయిన్లు కరోనా బారిన పడి పోరాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: