స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇందులో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా నటిస్తున్న రష్మిక మందన్న ఒక గిరిజన యువతి పాత్ర చేస్తున్నట్లు టాక్. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకి సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.

రంగస్థలం సూపర్ హిట్ తరువాత సుకుమార్ అలానే ఇటీవల అలవైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ తరువాత అల్లు అర్జున్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొడుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు టాక్. ఈ మూవీని ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 13న విడుదల చేయనున్నారు.

అయితే దీనికి సంబంధించి కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్న ఒక న్యూస్ ప్రకారం పుష్ప మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని, రెండవ భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తారనేది ఆ వార్త యొక్క సారాంశం. అలానే హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ కూడా మూవీ రెండు భాగాలు అయితే ఆడియన్స్ కి మరింతగా స్టోరీ కనెక్ట్ అవుతుందని భావించినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని, పక్కాగా పుష్ప మూవీ కేవలం ఒక్క పార్ట్ గానే తెరకెక్కి రిలీజ్ అవుతుందని అల్లు అర్జున్ క్యాంపు నుండి న్యూస్ బయటకు వచ్చినట్లు చెప్తున్నారు. దీనితో ఈ మూవీపై రెండు పార్టులు అంటూ వస్తున్న పుకార్లకు అడ్డు కట్ట పడిందని అంటున్నారు విశ్లేషకులు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: