ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి పేరున్న నటిగా యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి క్రేజ్ దక్కించుకుని కొనసాగుతున్న భామల్లో నివేద థామస్ కూడా ఒకరు. తొలిసారిగా తెలుగులో నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్ మెన్ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేదా ఆ మూవీ ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని, తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని అలరించింది. ఇక ఆ తరువాత నాని తో మరొక్కసారి ఆమె నటించిన సినిమా నిన్ను కోరి.

ఆపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జైలవకుశ మూవీ చేసి దానితో కూడా సక్సెస్ అందుకున్న నివేదా, ఆపై నందమూరి కళ్యాణ్ రామ్ తో 118, అలానే శ్రీవిష్ణు తో బ్రోచేవారెవరురా, అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్, నాని సుధీర్ బాబు ల కలయికలో రూపొందిన వి మూవీ లో కూడా నటించింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ లో ఒక ముఖ్య పాత్ర చేసి అందరినీ ఎంతో అలరించింది నివేదా థామస్.

అయితే లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుకున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారికా హాసిని క్రియేషన్స్ వారు రూపొందించనున్న భారీ సినిమాలో ఒక ముఖ్య పాత్రకు ఆమె ఎంపికైందని అంటున్నారు. ఇప్పటికే నివేదా ని కలిసి మూవీ కథ తో పటు ఆమె పాత్ర వినిపించిన దర్శకుడు త్రివిక్రమ్, ఆపై ఆమె కాల్షీట్స్ కూడా తీసుకున్నారని, త్వరలో దీనిపై అధికారిక న్యూస్ కూడా రానుందని చెప్తున్నారు. మరి ఈ వార్త కనుక నిజం అయితే మొన్న ఎన్టీఆర్ తో నిన్న పవన్ తో నటించిన నివేదా ఈసారి ఏకంగా సూపర్ స్టార్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టినట్లే అంటున్నారు విశ్లేషకులు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: