శ్రీ దేవి కుమార్తె జాన్వీ కపూర్ సౌత్ మీద ఫోకస్ పెట్టిందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఆమె బాలీవుడ్ కంటే సౌత్ బెటర్ అని భావిస్తోందట. అందుకే సౌత్ లో సినిమా అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నట్టు సమాచారం. తండ్రి బోనీ కపూర్ కూడా  సౌత్ మీద ఫోకస్ పెట్టి వరుసగా సౌత్ లోనే సినిమాలు చేస్తున్న నేపథ్యంలో జాన్వి కపూర్ కూడా ఇప్పుడు సౌత్ మీద దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. నిజానికి ముందు ఆమె సౌత్లో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు కానీ ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా ఆమె సౌత్ లో సినిమాలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది..



 గతంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది అంటూ ప్రచారం జరిగింది. కానీ అసలు సినిమా మొత్తానికి ఆగిపోవడంతో అది ఒట్టి ప్రచారంగానే మిగిలి పోయింది. ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలో కూడా జాన్వీ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి ముందుగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించాల్సి ఉంది.



 కానీ ఆమె తమిళ సినిమా కారణంగా డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో దిశాపటానిని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ఆమె పేరుతో పాటు జాన్వి కపూర్ కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. జాన్వీ సౌత్లో మరీ ముఖ్యంగా తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. గతంలో వచ్చిన మంచి మంచి ఆఫర్లను వద్దనుకున్న ఈ భామ ఇప్పుడు మళ్లీ మంచి ఛాన్స్ కోసం వేచి చూస్తోంది. మరి చూడాలి ఈ భామకు సౌత్ మీద ఉన్న ప్రేమ ఎంతవరకు ఆమెకు క్రేజ్ తెచ్చిపెడుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: