టాలీవుడ్ లో ప్రస్తుతం విలక్షణ నటుడిగా ప్రస్తుతం పలు డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ ముందు కొనసాగుతున్నారు జగపతిబాబు. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా సరికొత్త అవతారం ఎత్తిన జగపతి బాబు ఆ మూవీలోని తన యాక్టింగ్ తో ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్న జగపతిబాబు ఇటీవల మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన మన్యంపులి మూవీలో విలన్ గా నటించి బాగా గుర్తింపు సంపాదించారు.
అలానే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీలో ఆయన పోషించిన ప్రెసిడెంట్ పాత్రకి కూడా బాగా పేరు లభించింది. ఇక అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న కలయికలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీలో కూడా జగపతిబాబు ఒక కీలక పాత్ర చేస్తున్నానని కాగా ఆ పాత్ర కూడా నెగిటివ్ గా సాగుతుందని సమాచారం. అలానే ఈ క్యారెక్టర్ కూడా నటుడిగా జగపతిబాబుకి మరింత గుర్తింపునివ్వడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో టీజర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై బాగా పేరు దక్కించుకుంది. కాగా ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ నటుడిగా జగపతిబాబు కి ఏ స్థాయి గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: