ఇప్పటికే దేశంలో కరోనా పంజా విదిలిస్తున్న నేపథ్యంలో సామాన్యులే కాకుండా సెలెబ్రిటీలు కూడా దీనివల్ల మృత్యువాత పడుతున్నారు.. ఇంత డబ్బు ఉండి కూడా ఈ మహమ్మారి ని కట్టడి చేయడంలో వారు విఫలమవుతున్నారు. ఇంకా చాలామంది కరోనా తో బాధపడే ప్రముఖులు ఉన్నారు.. కరోనా తో ఇటీవలే మరణించిన వారిలో దర్శకుడు ఎస్పీ జననాథన్, హాస్యనటుడు వివేక్, ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కె.వి.ఆనంద్ వం టి పలువురు ప్రముఖులను ఉన్నారు.. వీరిని ఈ మహమ్మారి దారుణంగా బలి తీసుకుంది.
తాజాగా కరోనా వల్ల చనిపోయిన వారిలో మరొకరిగా ఉన్నారు మాయదారి మల్లిగాడు, గాజుల కిష్టయ్య, పంచాయితీ, సిరిమల్లె నవ్వింది, రక్తసంబంధం, శ్రీవారి శోభనం, రంభ రాంబాబు, మాయదారి మరి ది వంటి హిట్ చిత్రా ల నిర్మాత ఆదుర్తి సుబ్బారావు బావమరిది హీరో కృష్ణ కు సన్నిహితులు అయిన ఎమ్.ఎస్. ప్రసాద్.. అయన అనారోగ్యంతో కన్నుమూశారనే వార్త బయటకు వచ్చింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఏదేమై నా ఈ మహమ్మారి ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కరి ని బలితీసుకుంటూ అందరిని కలవరపెడుతుంది..ఇటీవలే నిర్మాత ఇఎం ఇబ్రహీం , హాస్య నటుడు పాండు, గాయకు డు గోమగన్,దర్శకుడు సెల్వ తండ్రి భక్తవత్సలం తుది శ్వాస విడిచా రు.