పిల్లలను అలా చేయాలి, ఇలా చేయాలని వారు చిన్నప్పటి నుంచే తల్లిందండ్రులు అనుకుంటారు. దానికి ఎవరూ అతీతులు కాదు. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా తమ పిల్లల గురించి ఇలానే ఆలోచిస్తారు. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూడా తమ పిల్లల గురించి ఇలానే కలలు కన్నారట. అయితే ఆమె తమ పిల్లలను సినీమా రంగంలోకి మాత్రం తీసుకురాకూడదని అనుకున్నారట. ముఖ్యంగా పెద్ద కూతురు జాన్విని డాక్టర్ చేయాలని అనుకున్నారట. అయితే ఆ కోరిక మాత్రం శ్రీదేవి తీర్చుకోలేకపోయారట. ఈ విషయాలను జాన్వినే స్వంయంగా వెల్లడించింది.

జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. నటిగా తనని తాను నిరూపించుకునేందుకు జాన్వీ ప్రస్తుతం ట్రై చేస్తుంది. ఈ మధ్యనే ఆమె నటించిన ‘రూహి’ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో దెయ్యం పట్టిన యువతి పాత్రలో జాన్వి నటనపరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది.
 ‘సైరట్’ రీమేక్‌ ‘ధడక్’తో ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ తన తల్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

‘నన్ను హీరోయిన్‌ను చేయడం మా అమ్మకు అసలు ఇష్టం కాదు. అమ్మ పెద్ద నటి అయినా.. నన్ను మాత్రం నటిని చేయాలనుకోలేదు. నా చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను డాక్టర్‌ని చేయాలనే అంటూ ఉండేది. కానీ నాకు డాక్టర్ అయ్యేంతగా చదువు అబ్బలేదు. అంత తెలివి కూడా లేదు. అందుకే నటిగా కెరియర్ ప్రారంభించాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా, జాన్వీ కపూర్ నటిస్తోన్న ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘తఖ్త్’ చిత్రం సెట్స్‌పై ఉంది. అయితే జాన్వి కపూర్ ఫస్ట్ మూవీ ధడక్ విడుదలకు ముందే శ్రీదేవి మరణించారు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి మరణించగా.. జూలైలో ధడక్ సినిమా విడుదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: