జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా కొనసాగుతోంది. నటిగా తనని తాను నిరూపించుకునేందుకు జాన్వీ ప్రస్తుతం ట్రై చేస్తుంది. ఈ మధ్యనే ఆమె నటించిన ‘రూహి’ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో దెయ్యం పట్టిన యువతి పాత్రలో జాన్వి నటనపరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది.
‘నన్ను హీరోయిన్ను చేయడం మా అమ్మకు అసలు ఇష్టం కాదు. అమ్మ పెద్ద నటి అయినా.. నన్ను మాత్రం నటిని చేయాలనుకోలేదు. నా చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను డాక్టర్ని చేయాలనే అంటూ ఉండేది. కానీ నాకు డాక్టర్ అయ్యేంతగా చదువు అబ్బలేదు. అంత తెలివి కూడా లేదు. అందుకే నటిగా కెరియర్ ప్రారంభించాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా, జాన్వీ కపూర్ నటిస్తోన్న ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘తఖ్త్’ చిత్రం సెట్స్పై ఉంది. అయితే జాన్వి కపూర్ ఫస్ట్ మూవీ ధడక్ విడుదలకు ముందే శ్రీదేవి మరణించారు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి మరణించగా.. జూలైలో ధడక్ సినిమా విడుదలైంది.