నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ అనే సినిమా చేస్తున్నాడు. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో గతంలో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన నేపథ్యంలో ఈ మూడో సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలను ఏమేరకు బాలకృష్ణ-బోయపాటి అందుకుంటారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా పూర్తయిన వెంటనే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికైతే అధికారిక ప్రకటన లేదు కానీ దాదాపుగా ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయినట్లే.. ఒక నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. 



బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఒక ఫ్యాక్షనిస్టు పాత్ర అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ నటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక యంగ్ హీరోయిన్ అలాగే ఒక వయసు అయిపోయిన హీరోయిన్ ఇద్దరినీ ఈ సినిమా కోసం ఆయన తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే కుర్ర హీరోయిన్ పాత్ర కోసం శృతి హాసన్ ను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. 



చాలా కాలం తర్వాత తనకు క్రాక్ లాంటి సినిమా అవకాశం ఇచ్చి సూపర్ హిట్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృతజ్ఞతగా ఆమె ఈ ఆఫర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్య సరసన మీనా కూడా హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం వెంకటేష్ సరసన హీరోయిన్గా రెండు సినిమాల్లో నటిస్తోంది. దీంతో ఆమె అయితే బాలకృష్ణ పక్కన బాగుంటుందని దర్శకుడు భావించి ఆమెను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ - మీనా కాంబినేషన్ లో కొన్ని హిట్ సినిమాలు ఉండటంతో ఆమె కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మీనా పాత్ర హైలైట్ అని అంటున్నారు. మొత్తం మీద ఒకే సినిమాలో బాలకృష్ణకి ఇద్దరు హీరోయిన్స్ ని ఫిక్స్ చేసి మలినేని పెద్ద ప్లానే వేశాడు అనే ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: