టాలీవుడ్ లో మ్యాచో స్టార్ గా పేరు తెచ్చుకున్న
గోపీచంద్ కు ఈ మధ్య కాలంలో అసలు కాలం కలిసి రావడం లేదు. చివరిగా 2014లో లౌక్యం సినిమాతో హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఒక్క హిట్
సినిమా కూడా పడటం లేదు. ఆయన
సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే
సినిమా చేశాడు. క్రీడల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో
గోపీచంద్ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ
సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ
సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది ఏమో అని భయంతో నిర్మాతలు కొత్త ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
నిజానికి ఈ
సినిమా ఒక సారి వాయిదా పడడానికి కరోనా కారణం కాగా అంతకుముందు వాయిదా పడడానికి మాత్రం వేరే కారణం ఉందని అంటున్నారు ఈ
సినిమా నిర్మాత భారీగా థియేట్రికల్ రైట్స్ మీద ఆశలు పెట్టుకున్నారని అయితే
గోపీచంద్ మార్కెట్ దృష్ట్యా అంతా రేట్లు పలకడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒకసారి
సినిమా వాయిదా వేశారని అంటున్నారు. అయితే కరోనా కారణంగా రెండోసారి కూడా వాయిదా పడడంతో ఈసారి ఆయన నేరుగా ఓటీటీ సంస్థలను సంప్రదిస్తున్నట్లు సమాచారం.
సినిమా థియేటర్ లో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే యోచనలో ఆయన సంస్థలను అప్రోచ్ కాగా సంస్థల నుంచి మంచి ఫ్యాన్సీ ఆఫర్స్ లభించినట్లు సమాచారం. దీంతో థియేట్రికల్ రిలీజ్ చేయకుండా నేరుగా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ సరసన
తమన్నా నటించిన ఈ
సినిమా క్రీడల నేపథ్యంలో రూపొందింది. గోపీచంద్ ఆంధ్ర లేడీస్ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపిస్తూ ఉండగా
హీరోయిన్ తమన్నా తెలంగాణ లేడీస్ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపిస్తోంది. మరి చూడాలి చివరికి ఈ
సినిమా రిలీజ్ ఎలా జరుగుతుంది అనేది.