కమలహాసన్ కి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి పాత్రకు ప్రాణం పోస్తాడు. ఇలా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ రాజకీయాల్లోకి ప్రవేశించి మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించాడు కమలహాసన్. మొదటి నుంచి ఆయన భావజాలం ఎంతో భిన్నంగా వివాదాస్పదం గానే ఉంది. అయితే ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ప్రత్యక్షంగా పోటీ చేసింది కమల్ పార్టీ. కానీ ఇటీవలే పోటీచేసిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా నిరాశ ఎదురైంది.
మక్కల్ నీది మయ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థి కూడా గెలవలేదు. స్వయంగా పార్టీ అధినేత సైతం ఓడిపోయాడు. దీంతో అభిమానులు కార్యకర్తలు పార్టీ నేతలు అందరిలో కూడా నైరాశ్యం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఎంతో మంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు స్వయంగా పార్టీ ఉపాధ్యక్షుడు సైతం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు కూడా కమల్ పార్టీ పట్ల ఆయన భావజాలం పట్ల ఏ మాత్రం ఆసక్తి గా లేనట్లు తెలుస్తుంది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కమల్ రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తోంది.