తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకధీరుడు రాజమౌళి గురించి తెలియని వారంటూ లేరు. టాప్ డైరెక్టర్లలో ఆయన కూడా ఒకరు. ఆయన చిత్రీకరించిన సినిమాలు అన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమా ప్రభాస్‌కు కెరియర్‌లోనే బెస్ట్ హిట్ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తీసుకొచ్చింది.



ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడానికి చాలా సమయం ఉన్నా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు అటు రామ్ చరణ్ ఫ్యాన్స్.. ఇటు తారక్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు.

 


అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిన విషయమే. ఎన్టీఆర్, రామ్ చరణ్ భీకర పోరాట సన్నివేశంలో కలుస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ చరణ్ కలిసే సన్నివేశాలను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీలో షాకింగ్ ట్విస్టులతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది.



మరోవైపు కరోనా వల్ల ఈ సినిమా బడ్జెట్ పెరిగిందని దాదాపు 450 కోట్ల రూపాయలు నిర్మాతసినిమా కోసం ఖర్చు చేశారని తెలుస్తోంది. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా.. ఈ సినిమాలో చాలామంది అగ్ర నటులు నటిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇద్దరు హీరోయిన్లకు సమ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ ఆలస్యమవుతున్నా.. చరణ్, ఎన్టీఆర్ కెరియర్‌లో ఈ సినిమా మెమరబుల్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: