టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. టాలీవుడ్ లో ఇలాంటి డైరెక్టర్ రాలేదు.. ఇకపై రాదు అనే చెప్పాలి.. ఒక సినిమా హీరో పాత్ర ను ఇలా కూడా డిజైన్ చేయొచ్చా అని ముక్కున వేలేసుకునే విధంగా అయన సినిమాలోని హీరోలు ప్రవర్తిస్తూ ఉంటారు..మొదట్లో సక్సెస్ ల మీద సక్సెస్ లతో దూసుకుపోయిన పురీ ఆమధ్య కాస్త వెనకపడ్డాడు.. దాంతో మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకోవాలని హీరో రామ్ తో చేతులు కలిపాడు.

 ఇస్మార్ట్ శంకర్ సినిమా తో పూరీజగన్నాధ్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడని చెప్పొచ్చు.. ఈ సినిమా కి ముందు వరకు పూరి జగన్నాధ్ పనిఅయిపోయిందనుకున్నారు అంతా.. కానీ అనూహ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవడం ఒక్కసారిగా పూరి లో మంచి జోష్ వచ్చినట్లు కనిపిస్తుంది.. ఆ జోష్ లో విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా ని మొదలుపెట్టాడు.  ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇక ఈ  సినిమా పై మంచి అంచనాలుండగా ఈ సినిమా పూరీ కెరీర్ కి కూడా ఎంతో కీలకంగా మారుతుందని చెప్పొచ్చు..

ఇదిలా ఉంటే పూరీజగన్నాధ్ పోడ్కాస్ట్ కూడా చెప్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. రకరకాల సబ్జెక్టుల్ని ఎంచుకుని పూరి చెప్పిన చాలా సంగతులు యవతరానికి ఫుల్ గా  నచ్చేస్తున్నాయి. తాజాగా పెళ్లి గురించి పూరి చేసిన కామెంట్ వేడెక్కించింది.ఒకసారి పెళ్లికి కమిటైపోతే ఇక నదిలో దూకినట్టేనని వ్యాఖ్యానించారు.


కొందరి వద్ద  అనవసరమైన వాటి గురించి ఒక లిస్ట్ ఉంటుంది. అందులో పెళ్లి కూడా ఉంటుంది. పెళ్లి.. ఈ ఒక్కటి కమిట్ అయితే మినిమలిజం లేదు. గాడిదగుడ్డూ లేదు. నదిలోకి దూకేసినట్టే. కొట్టుకుపోతూ ఉంటాం. ఎక్కడ ఆగుతామో ఎవ్వరికీ తెలీదు. అలా నది లోకి దూకరు కాబట్టే మినిమలిస్టులు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్లు బంధాలకు ఎక్కువ విలువ ఇవ్వరు. కానీ అనుబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు.. అని పూరి వ్యాఖ్యానించారు

మరింత సమాచారం తెలుసుకోండి: