ఈ సినిమా అనంతరం ఈ ఇద్దరు స్టార్ హీరోలు పలు భారీ చిత్రాల లైనప్ ను పెట్టుకున్నారు. అయితే తారక్ కూడా థన్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తన 30వ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను జూన్ నుంచి ప్రారంభించబోతున్నట్లు కూడా వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యూలర్ షూటింగ్ ఆలస్యం కాబోతుందట. దీనికి కారణం కరోనా వల్ల వీళ్లిద్దరూ చేస్తున్న చిత్రాల షూటింగులు వాయిదా పడిపోవడమేనని తెలిసింది.
దీనిపై రీసెంట్ గానే అనౌన్సమెంట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ లేటెస్ట్ టాక్ ప్రకారం మాత్రం ఈ సెన్సేషనల్ కాంబోపై రాబోయే రోజుల్లో మెజర్ అప్డేట్ ఏమీ ఉండదట. అంటే రాబోయే తారక్ పుట్టినరోజున పెద్దగా ఎలాంటి అనౌన్సమెంట్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఉండకపోవచ్చని తెలుస్తుంది. అందుకే ఆ రోజుకి ఈ ప్రాజెక్ట్ పై మాత్రం అభిమానులు తక్కువ అంచనాలు పెట్టుకుంటేనే మంచిది. కానీ రాజమౌళితో సినిమా నుంచి మాత్రం ఖచ్చితంగా అప్డేట్ రానుంది. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్తో యూనివర్శల్ కాన్సెప్టుతో ఇది రూపొందనుంది.