స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి గత రెండు రోజులుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది..పుష్ప సినిమా రెండు భాగాలుగా ఉండనుందనేదే ఆ వార్త సారాంశం.. ఎలక్ట్రానిక్, వెబ్ అని తేడా లేకుండా అన్ని మీడియాల్లోనూ ఈ వార్త తెగ హల్‌చల్ చేసింది. సోషల్ మీడియాలోనూ దీని గురించి పెద్ద చర్చ జరిగింది. ఇది జస్ట్ రూమరా.. నిజమైనా వార్తేనా అన్న విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. నిజమే అయితే.. అధికారికంగా ప్రకటన ఏమీ లేదే అన్న డౌట్ కొడుతోంది.కానీ వాస్తవం ఏంటంటే.. ఈ విషయంలో సుకుమార్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.

 ముందు ఆయన టీం నుంచే ఈ మేరకు మీడియాకు లీక్ ఇచ్చినట్లు సమాచారం. మీడియా ఎలా స్పందిస్తుంది.. ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు.. సోషల్ మీడియాలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది అని చూడటానికే ఈ లీక్ ఇచ్చాడట సుక్కు.జనాల స్పందనను బట్టి సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటారట.ఈ నెలాఖరుకు సుక్కు 'పుష్ప'ను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయమై నిర్ణయం తీసుకుంటారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు 'బాహుబలి'ని ఒక సినిమాగా తీయాలని మొదలుపెట్టి.. మధ్యలో నిడివి ఎక్కువవుతోందని భావించి, ఆర్థిక ప్రయోజనాలు కూడా చూసుకుని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 ముందు కొంత వ్యతిరేకత వచ్చినా.. చివరికి ఆ ప్రయోగం అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు సుక్కు ఆలోచన కూడా ఇలాగే ఉంది. ఆయన 'పుష్ప' కోసమని ఎంతో పరిశోధన చేశారు. బోలెడంత కంటెంట్ రెడీ చేశాడు. ఒక దశలో 'పుష్ప' సినిమా తీయగా మిగిలిన కంటెంట్‌తో ఓ వెబ్ సిరీస్ తీయాలని ఆయన అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు.ఐతే ఇప్పుడు ఆయనకు రెండు భాగాలుగా సినిమా తీసే ఆలోచన వచ్చింది. ఐతే 'బాహుబలి' సంగతి వేరు. 'పుష్ప' లాంటి సోషల్ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే వర్కవుట్ అవుతుందా అన్న సందిగ్ధత కూడా లేకపోలేదు. అందుకే తన టీంతో మరింతగా చర్చించి.. జనాల ఫీడ్ బ్యాక్ చూసుకుని.. అలాగే స్క్రిప్టు ఏమేర సపోర్ట్ చేస్తుందో చూసుకుని అప్పుడు ఓ డెసిషన్ కి రానున్నాడట సుకుమార్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: