ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో యువ నటిగా తనదైన ఆకట్టుకునే అందం అభినయంతో పాటు అదిరే డాన్స్ తో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకున్న నటి సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన సాయిపల్లవిమూవీ ద్వారా బ్లాక్బస్టర్ సక్సెస్ కొట్టారు. ఇక ఆ సినిమాలో సాయి పల్లవి నటన, డాన్స్ తో అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ తో మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి అక్కడి నుండి వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ కొనసాగారు. మరోవైపు తమిళం, మలయాళంలో కూడా ఆమె మంచి ఛాన్సులు అందుకుంటూ తద్వారా విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవి నాగ చైతన్య సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ మూవీతో పాటు రానా దగ్గుబాటి హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం సినిమా కూడా చేస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాల టీజర్స్, సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్లో మంచి క్రేజ్ దక్కించుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. నిజానికి సాయి పల్లవి యాక్టింగ్, డాన్స్ కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడనే చెప్పాలి, అలానే ఆమెకి యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అసలు మ్యాటర్ ఏమిటంటే నేడు సాయి పల్లవి జన్మదినం సందర్భంగా పలువురు ప్రేక్షకులు అభిమానులు ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. అలానే  రాబోయే రోజుల్లో తన సినిమాలతో కెరీర్ పరంగా సాయి పల్లవి మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుతున్నారు ఆమె అభిమానులు .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: