ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో యువ నటుడిగా మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్నారు విజయ్ దేవరకొండ. తొలిసారిగా పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా మారిన విజయ్ ఆ మూవీతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి అలానే పరశురాం పెట్ల దర్శకత్వంలో రూపొందిన గీతా గోవిందం సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకుని హీరోగా విజయ్ దేవరకొండకి స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టాయి.

ఇక ప్రస్తుతం విజయ నటిస్తున్న లేటెస్ట్ సినిమా లైగర్. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు ఫిదా మూవీ తో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన యువ భామ సాయి పల్లవి ఆ మూవీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే ఆపై అనేక సినిమాల్లో నటించిన సాయి పల్లవి, తన యాక్టింగ్, డాన్స్ తో  ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళం వంటి భాషల్లో కూడా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య తో లవ్ స్టోరీ, రానాతో విరాట పర్వం సినిమాలు చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే రౌడీ హీరో విజయ్, హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి కలిసి ఒక సినిమాలో జోడికడితే చూడాలని ఎప్పటినుండో పలువురు ప్రేక్షకులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ మూవీ సూపర్ హిట్ ఖాయం అని, తమ ఆకట్టుకునే యాక్టింగ్ స్టైల్ తో అదరగొట్టే ఈ ఇద్దరు తారలు ఒకే తెరపై కనిపిస్తే రచ్చ రచ్చే అని పలువురు ప్రేక్షకులు అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు నేడు విజయ్ దేవరకొండ, సాయి పల్లవి ల జన్మదినం కావడంతో ఆడియన్స్ తో పాటు పలువురు సినిమా ప్రముఖులు సైతం వారిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ప్రేక్షకాభిమానులు ఆశిస్తున్నట్టు వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందో లేదో తెలియాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి అంటున్నారు సినీ విశ్లేషకులు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: