టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా బ్యాంకింగ్ రంగంలో ఇటీవల జరిగిన పలు ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతుండగా ఈ మూవీని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గీతా గోవిందం ఫ్రేమ్ పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం తదుపరి మహేష్ నటించనున్న 28వ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింది.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మితం కానున్న ఈ మూవీకి తమన్ దీనికి స్వరాలు సమకూర్చనున్నారు. జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఒక రా ఏజెంట్ గా కనిపించనుండగా ఈ మూవీకి పార్ధు అనే టైటిల్ ని పెట్టాలని యూనిట్ భావిస్తున్నట్లుగా సమాచారం. మంచి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ అదిరిపోతుందని అలాగే ఒక స్టార్ నటి ఆయన సరసన జోడీ కట్టనుందని అంటున్నారు.

మరోవైపు ఈ రెండు సినిమాల అనంతరం ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర తో ఒక సినిమాతో పాటు యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయనున్నారట మహేష్ బాబు. ఇక ఈ నాలుగు సినిమాల అనంతరం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు మహేష్. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ విధంగా మహేష్ బాబు ఒక దాని వెంట మరొకటి సినిమాలను వేగవంతంగా చేస్తూ కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్తున్నారు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: