సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట " సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా 60 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రారంభమై ఏడాది పూర్తి అయినప్పటికి ఇంతవరకు మహేష్ ఫస్ట్ లుక్ గాని, టిజర్ గాని రిలీజ్ చేయలేదు చిత్ర బృందం. దాంతో మహేష్ అభిమానులు టిజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 11 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆ తరువాత మహేష్ నటించే సినిమాపై సందిగ్ధత నెలకొంది.

 ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా తరువాత మహేష్ - రాజమౌళి ప్రాజెక్ట్ పట్టలేక్కే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో త్రివిక్రమ్ సినిమా తరువాత మహేష్ నటించే సినిమాపై ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మహేష్ బాబు కు "సరిలేరు నికెవ్వరు " వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనిల్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడట. అన్నీ కుదిరితే త్రివిక్రమ్ సినిమా తరువాత మహేష్ బాబు చేయబోయే చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: