చిత్రం సినిమాతో మెగా ఫోన్ పట్టిన సంచలన డైరెక్టర్ తేజా. ఆయన కెరీర్ లో మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. ఆయన డిస్కవరీగా కాజల్ అగర్వాల్ ని చెప్పుకోవాలి. ఇక ఎంతో మంది నటీనటులను, టెక్నీషియన్లను కూడా ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఆయనకు నేనే రాజు నేనే మంత్రి మూవీ తరువాత హిట్ లేదు, ఆ తరువాత్ కాజల్ ని మెయిల్ లీడ్ గా పెట్టి తీసిన సీత మూవీ నిరాశపరచింది. ఆ తరువాత ఆయన చాలా ప్రాజెక్టులు అనుకున్నారు. అలిమేలు మంగ వెంకటరమణ అంటూ ఒక మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే అంతా కొత్త వారితో చిత్రం టూ మూవీని తీస్తానని కూడా తేజా ప్రకటించారు.

దాంతో చాలా మంది ఔత్సాహిక కళాకారులు చాలా సంతోషించారు. తమకు కూడా సినిమాల్లో నటించే చాన్స్ వస్తుందని అనుకున్నారు. చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కాబట్టి తన కెరీర్ ని కూడా తేజా మేలి మలుపు తిప్పుతారు అని కూడా ఆశించారు. అయితే సడెన్ గా ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో లేదు అంటూ తేజా ఒక్కసారిగా షాక్ ఇచ్చేశారు.

ఇపుడు కరోనా ఎఫెక్ట్ ఉంది. ఈ టైమ్ లో అందరూ కొత్తవారితో మూవీ చేస్తే అది పెద్ద రిస్క్ అని భావించి ఆయన ఈ ప్రతిపాదనను వాయిదా వేశారని అంటున్నారు. మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చిన మీదటనే సినిమాను చిత్రం సీక్వెల్ తీస్తారని అంటున్నారు. ఈ గ్యాప్ లో ఆయన సురేష్ ప్రొడక్షన్స్ వారి సినిమా చేడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటున్నారు.
దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించే డెబ్యూ ఫిల్మ్ కి తేజాయే డైరెక్టర్ అంటున్నారు. ఈ మూవీ మీద ఆయన ఇపుడు దృష్టి పెట్టబోతున్నారుట. దాంతో ఈ మూవీ ని హిట్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారని టాక్. సో ఇప్పటికైతే చిత్రం సీక్వెల్ లేనట్లే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: