ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. అయితే కరోనా కారణంగా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రభాస్ కూడా ఫ్రీ అయినట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్‌తో దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఇతిహాస ఆధారిత కథ ‘ఆదిపురుష్’. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా.. కృతి సనన్ సీతా దేవి పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రం షూట్ ఇటీవల హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. ప్రభాస్ స్వయంగా అందిరినీ హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే షూట్ చేయాలని కోరడంతో ఇప్పుడు క్రూ మొత్తం హైదరాబాద్‌కు వచ్చి షూటింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలోనే ప్రభాస్ ఓ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సడెన్‌గా షూట్ చేంజ్ చేసిన నేపథ్యంలో ఆదిపురుష్ బడ్జెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదని దర్శకుడు ఓం రౌత్‌కు ప్రభాస్ కచ్చితంగా చెప్పేశాడట.ఈ విషయంలో ఇప్పటికే ఓం రవుత్‌తో అనేకసార్లు సంప్రదింపులు కూడా జరిపాడట.

అక్కడ నుంచి ఇక్కడకి క్యాస్ట్ అండ్ క్రూ షిఫ్ట్ అవుతున్నందుకు కొంత మేర ఇబ్బందులు తలెత్తుతాయని, అది వాస్తవమేనని, కానీ దాని వల్ల బడ్జెట్ పెంచకుండా ఉండాలని ప్రభాస్ పట్టుబడుతున్నాడట. అందుకే ప్రభాస్ ఈ చిత్రం బడ్జెట్ విషయంలో ఓం రౌత్‌తో ఇప్పటికే అనేకసార్లు సంప్రదింపులు కూడా జరిపాడని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ న్యూస్ ఏమీ రాలేదు.

చూశారా..! నిర్మాతల కోసం ప్రభాస్ ఎంత కేర్ తీసుకుంటున్నాడో. మరి మేకర్స్ కూడా బడ్జెట్ విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్నారా..? లేదా..? అనేది చూడాలి. ఈ చిత్రాన్ని నిర్మాతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్ సంయుక్తంగా రూ.500 కోట్ల మేర బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: