రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ మంచి జోరుతో ముందుకు కొనసాగుతున్నారు. వాటిలో జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ తో చేస్తున్న రాధేశ్యామ్ మూవీ షూటింగ్ చాల వరకు పూర్తి కాగా, కేవలం ఒక సాంగ్ షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగే రెట్రో లవ్ స్టోరీ మూవీ గా పలు కమర్షియల్ హంగుల కలబోతగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అలానే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తీస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ లో రాముడిగా నటిస్తున్నారు ప్రభాస్. కృతి సనన్ సీత పాత్ర చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో వేసిన ఇండోర్ సెట్టింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలతో పాటు హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న సలార్ మూవీ కూడా చేస్తున్నారు ప్రభాస్. కెజిఎఫ్ సినిమాల దర్శకడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దాదాపుగా ముప్పై శాతం షూటింగ్ జరుపుకున్నట్లు సమాచారం. అయితే ఈ మూడు సినిమాల అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వం లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించనున్న భారీ పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేయనున్నారు ప్రభాస్.

జులై లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది చివర్లో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పలువురు హాలీవుడ్ దిగ్గజ నటులు, టెక్నీషియన్లు పని చేయనున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించనుండగా అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చేయనున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఈ మూవీ స్క్రిప్ట్ ని దర్శకుడు నాగ వంశి ఎంతో అద్భుతంగా రాసుకున్నారని, అలానే ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఎంతో కొత్తగా ఉండనుందని, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందనున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ కి ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ గా మరింత గొప్ప పేరు రావడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. మరి అందరిలోనూ ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా రేపు సెట్స్ మీదకు వెళ్లి ఆపై రిలీజ్ తరువాత ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి ..... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: