గతకొన్ని సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారమవుతున్న అలీతో సరదాగా షో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ షోకి ఎంతోమంది సెలబ్రెటీలను పిలిచి వాళ్ళ దగ్గర నుండి కీలక సమాచారం రాబడుతుంటారు. అలా అలా సరదాగా సురేఖా వాణితో ముచ్చటిస్తూ చిరంజీవి టాపిక్ తీశారు ఆలీ. చిరంజీవిని మొదటిసారి చూడగానే మీరు ఏడ్చేశారట.. నిజమేనా? అని అడగడంతో అసలు విషయం బయటపెట్టింది సురేఖా వాణి.
ఆమె మాట్లాడుతూ.. 'అదేంటో.. తెలియలే ఆయన్ను చూడాగానే పట పటా కన్నీళ్లు వచ్చేశాయి. నేనలా ఏడుస్తుంటే ఆయన నా దగ్గరకొచ్చి అయ్యో! ఎందుకు ఏడుస్తున్నావ్. ఏడవకు.. ఏడవకు అని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకున్నారు. ఒక్కోసారి గుళ్లోకి వెళ్లినపుడు దేవుడిని చూస్తే ఏడుపొస్తుంది.. అలాగే చిరంజీవిని చూస్తే కూడా నాకు ఏడుపొచ్చేసింది'' అని సురేఖా వాణి తెలిపింది. చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించానని, ఆ తర్వాత ఓ రోజు ఆయన పర్సనల్గా పిలిచి తనతో మాట్లాడారని ఆమె తెలిపింది.
అయితే పెళ్లికి ముందే నారాయణ మూర్తితో 'తెలుగోడు' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి.. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి బిడ్డ పుట్టాక మళ్లీ సినిమాలు చేశానని చెప్పుకొచ్చింది సురేఖా వాణి. ఆలీ అడిగిన అన్ని ప్రశ్నలపై ఓపెన్గా మాట్లాడిన ఆమె.. 100 ముద్దులు ఇవ్వాలనుకునే హీరో ఎవరున్నారు? అనే ప్రశ్నపై పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. అలాగే తనకు కత్తిలా ఉంది అనిపించే హీరోయిన్ శ్రీదేవి అని సురేఖ చెప్పింది.