ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ తో చేస్తున్న " ఆచార్య " పూర్తి అయిన వెంటనే తారక్ సినిమా మొదలు పెట్టనున్నాడు. ఇక కొరటాల తన ప్రతి సినిమాలోను హీరోతో సమానమైన ఓ కీలక పాత్ర ఉంటుంది. అలాగే తారక్ తో తియ్యబోయే సినిమాలో కూడా ఓ బలమైన పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు కొరటాల ఇప్పటికే ప్రకటించాడు. దీంతో బాలీవుడ్ స్టార్ అయితే సినిమాకు మరింత హైప్ రావడం ఖాయమని కొరటాల భావిస్తున్నారట.
అందుకోసం ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని బీటౌన్ వర్గాల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో బిగ్ బి మెగాస్టార్ చిరంజీవి " సైరా " తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్ట్ ఒకే అయితే ఎన్టీఆర్ తో మరో పవర్ ఫుల్ రోల్లో అమితాబ్ బచ్చన్ ఆడియన్స్ ను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను 2022 ఏప్రెల్ 29న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం కరోనా కరణంగా పలు బడా మూవీస్ యొక్క షూటింగ్స్ అన్ని నిలిచిపోయాయి. దాంతో ఈ మహమ్మారి ఉదృతి తగ్గిన తరువాత కొరటాల- ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. .