ప్రస్తుతం టాలీవుడ్ లో తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకులలో ఒకరు దేవి శ్రీ ప్రసాద్.. గత కొంతకాలంగా దేవిశ్రీ ప్రసాద్ పెద్ద హీరోలకు సంగీతం అందిస్తు వారి అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా తన అభిమానులను కూడా ఎంతగానో ఆలరిస్తూ వస్తున్నారు.దక్షిణాన రాక్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీ సంగీతం వల్లే ఎన్నో పాటలు సూపర్‌ హిట్టాయ్యాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు .సంగీత ప్రపంచంలో పోటీ ఎంత ఎక్కువగా ఉంటే ఫలితం అంతా ఎక్కువగా వస్తుందని అంటూ ఉంటారు.. అలా దేవిశ్రీ ప్రసాద్ కి మొదటి నుంచి ఇతర సంగీత దర్శకులు నుంచి మంచి పోటీ ఉండటంతో ఆయన టాలీవుడ్ లో నిలిచిపోయే ఎన్నో హిట్ పాటలను అందించగలిగారు.

ప్రస్తుతం తమన్ తన మ్యూజిక్ తో దూసుకుపోతుండగా దేవిశ్రీప్రసాద్ ఒక అడుగు వెనక్కి వేసినట్లు గా కనిపిస్తున్నాడు.. కానీ తన పాటల్లో పదును ఏ మాత్రం తగ్గలేదని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలకు పైగా పెద్ద హీరోల సినిమాలు ఉండగా ఆ సినిమాలలో పాటలు ముందు ముందు చూద్దాం.                              

సీనియర్ రైటర్ సత్యమూర్తి తనయుడు అయిన దేవిశ్రీ ప్రసాద్ కి ఇండస్ట్రీలో అవకాశం రావడానికి పెద్దగా కష్టపడలేదు. సంగీతం మీద ఇంట్రెస్ట్ తో పెద్ద పెద్ద సంగీత దర్శకుల వద్ద పని నేర్చుకొని ఆ తరువాత ఎమ్మెస్ రాజు నిర్మించిన దేవి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు దేవీశ్రీ ప్రసాద్... ఈ సినిమాకి సంగీత దర్శకుల ఎంపిక గురించి ఎమ్మెస్ రాజు గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..మొదట ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా అనుకోలేదని ఇళయరాజా అనుకున్నామని ఆయన వెల్లడించారు.. కానీ ఇళయరాజా రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పడంతో దేవి శ్రీ ప్రసాద్ తో వెళ్ళామన ఆయన చెప్పుకొచ్చారు..                                                      

          


మరింత సమాచారం తెలుసుకోండి: