మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తన సినిమాని క్యాన్సిల్ చేసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అన్న ప్రచారానికి తెరలేపుతూ ఇటీవలే వీరి కాంబినేషన్ లోని చిత్రం యొక్క అధికారిక ప్రకటన వచ్చింది.. గతంలో వీరి కాంబినేషన్లో రెండు ఫ్లాప్ సినిమాలు వచ్చినా కూడా వీరి కాంబినేషన్ లో మరో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.              

అతడు, ఖలేజా ఈ రెండు సినిమాలు వీరి కాంబినేషన్ లో వెండితెరపై ఫ్లాప్ లుగా నిలవగా బుల్లి తెరపై మాత్రం బిగ్గెస్ట్ హిట్ లు గా నిలిచాయి. దాంతో ఈ కాంబినేషన్ లో  ఒక హిట్ సినిమాకి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. మళ్లీ కాంబినేషన్ కుదురుతుందా లేదా అన్న అనుమానాలను ఇటీవల వచ్చిన అధికారిక ప్రకటన తీర్చినట్లు అయ్యింది.. మొత్తానికి వీరి కలయిక కోసం ఎదురు చూసిన వారి కలలు పండాయి..                                 

అయితే త్రివిక్రమ్ ఈ సినిమాని మరింత ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు అని తెలుస్తుంది.. ఓవైపు ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సల్ అవ్వడం తనకు అవమానంగా భావిస్తున్నాడు త్రివిక్రమ్. మరోవైపు రెండు ఫ్లాపులు ఇచ్చిన హీరోతో పని చేస్తున్నాడనే భయం ఉంది.. ఈ నేపథ్యంలో ఈ రెండు అవమానాలను అధిగమించేలా ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడట త్రివిక్రమ్.. అందుకే ఈ చిత్రం కోసం సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ రంగంలోకి దించుతుందో గా మరొక హీరో కి కూడా కీలకపాత్ర రాస్తున్నాడట.. మహేష్ బాబు తో పూర్తిగా సినిమా మొత్తం ఉండే ఈ హీరో సుమంత్ అని చెబుతున్నారు. మరి ఇన్ని స్పెషల్స్ ఉన్నా ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూద్దాం..                            
                    

మరింత సమాచారం తెలుసుకోండి: