బోయపాటి శను ఎక్కడ పోయిందో అక్కడే వెవెతుక్కుంటున్నాడు.. మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను.. ఆయన తొలి సినిమా నుంచి మాస్ ఎంతగా మాస్ ప్రేక్షకులను అలరిస్తుందో అందరికీ తెలిసిందే.. ప్రతి ఒక్క హీరోడైరెక్టర్ తో ఒక మాస్ సినిమా చేయాలని ఆశిస్తూ ఉంటారు.. బోయపాటి శ్రీను చేతిలో పడితే మాస్ ఆడియన్స్ కూడా తమకు ఫ్యాన్స్ అవుతారని ప్రతి హీరో అనుకుంటాడు.. దాదాపు స్టార్ హీరోలు అందరితో చేసిన బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో తన మూడో సినిమా చేస్తున్నాడు..

వీరి కాంబినేషన్ లో గతంలో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి సూపర్ హిట్ కాగా ప్రస్తుతం అఖండ అనే ఓ చిత్రం తెరకెక్కబోతుంది.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాత్రల టీజర్ లు రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కించుకున్నాయి.. ఈ సినిమాలో బాలకృష్ణ ఓ పాత్రలో ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తుండగా మరో పాత్రలో అఘోర పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు..

సినిమా తర్వాత బోయపాటి శ్రీను చేసే సినిమా పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.. కొంతమంది అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను తన తదుపరి సినిమా చేస్తాడు అని ప్రచారం చేస్తుండగా కొన్ని కీలక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ తో తన తదుపరి సినిమా చేయడానికి ఆలోచిస్తున్నాడట.. వీరి కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా భారీ ఫ్లాప్ గా నిలవగా దానికి బదులు ఓ హిట్ సినిమాని అందించి రామ్ చరణ్ వద్ద తన కృతజ్ఞతలు తెలుపుతాడట బోయపాటి శీను.. సాధారణంగా  హీరోలు ఫ్లాప్ దర్శకులతో పని చేయడానికి ఎక్కువగా ఇష్టం చూపరు.. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను రామ్ చరణ్ ని ఏవిధంగా సినిమా చేయడానికి ఒప్పిస్తాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: