అందరి కుటుంబాల లాగనే సినిమా ఇండస్ట్రీలోని కుటుంబాలు కూడా ఆస్తులు తమ కుమారులకు ఆస్తులు పంచుతూ వస్తారు.. అలా దగ్గుబాటి వారి ఫ్యామిలీ లో కూడా సురేష్ బాబు వెంకటేష్ బాబు లకు ఆస్తులు పంచాడు సీనియర్ నిర్మాత రామానాయుడు.. మూవీ మొఘల్, డాక్టర్ రామానాయుడు తన ఇద్దరు కుమారులు అయిన సురేష్ బాబు, వెంకటేష్ ల కు తన ఆస్తి లోని మొత్తం భాగాన్ని చెరో సగం పంచారు. అయితే ఇక్కడ చిత్రమేంటంటే ఆస్తి వాటాలు పంచుకున్నట్లు సినిమా ఇండస్ట్రీని కూడా చెరో రంగాన్ని పంచుకున్నారు ఈ  ఇద్దరూ అన్నదమ్ములు.,

సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరు చెరో రంగంలో స్థిరపడ్డారు.. వెంకటేష్ హీరోగా తన కెరీర్ ని కొనసాగిస్తే, సురేష్ బాబు మాత్రం నిర్మాతగా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.. ఒక హీరోగా ఒకరు నిర్మాతగా ఇద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు లే.. కలియుగ పాండవులు సినిమా తో పూర్తిస్థాయి హీరోగా మారిన వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకుని, యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేసి కోట్లాది మంది అభిమానాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్2 సినిమా సీక్వెల్ f3 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా హీరోగా నటిస్తున్నాడు.. అలాగే కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన సినిమా రీమేక్ నారప్ప లో డిఫరెంట్ రోల్ లో వెంకటేష్ నటిస్తున్నాడు.. ఇదే కాకుండా మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమా రీమేక్ దృశ్యం 2 లోనూ వెంకటేష్ నటిస్తున్నాడు. దృశ్యం మొదటి భాగాన్ని కూడా వెంకటేష్ నటించడం విశేషం.. ఇదే కాకుండా మరో మలయాళం రీమేక్ పైన కూడా వెంకటేష్ దృష్టి పెట్టారని, త్వరలో ఆ సినిమాను కూడా మొదలు పెట్టనున్నారు అని తెలుస్తోంది.. సురేష్ బాబు కూడా పెద్ద సినిమాలు నిర్మిస్తు చిన్న సినిమాలకు కూడా అండగా ఉంటూ వాటి విజయానికి కారణం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: