టాలీవుడ్ లో ఎక్కువగా బడా ఫ్యామిలీ హీరోలదే డామినేషన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి, ఘట్టమనేని వంటి ఫ్యామిలీ హీరోల పాత్రే టాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ నుండి దాదాపుగా పది మంది హీరోలు ఇప్పటికే టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ నుండి నట సింహా బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వంటి వారు స్టార్ స్టేటస్ లో సత్తా చాటుతున్నారు. ఇక అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల నుండి, నాగార్జున, వెంకటేష్, రానా , నాగ చైతన్య, అఖిల్ వంటి హీరోలు ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు.

 ఇక  ఆ తరువాత ఘ్ట్టమనేని ఫ్యామిలీలో మాత్రం సూపర్ స్టార్ కృష్ణ తరువాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే మహేష్ తరువాత అంతటి క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఘట్టమనేని ఫ్యామిలీ నుండి కనిపించలేదనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బావ ట్యాగ్ లైన్ తో " ఎస్ ఏం ఎస్ " సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన సుధీర్ బాబు అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలం చెందుతున్నాడు.

 మొదటి సినిమా " ఎస్ ఏం ఎస్ " పరవలేదనిపించిన ఆ తరువాత వరుస ఫ్లాప్స్ తో వెనుకబడ్డాడు. ఇక ఆ మద్య వచ్చిన " భలే మంచి రోజు ", " ప్రేమకథ చిత్రమ్ ", " సమ్మోహనం " వంటి కూల్ హిట్స్ ఉన్నప్పటికి సుధీర్ బాబు క్రేజ్ మాత్రం పెరగలేదనే చెప్పాలి. ఇక గత ఏడాది నానితో కలిసి నటించిన " వీ " మూవీ కాస్త హైప్ తో రిలీజ్ అయినప్పటికి క్రెడిట్ మొత్తం నాని " ఖాతా లోకి చేరింది. దీంతో సుధీర్ బాబు ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పన్నెండేళ్ళు అవుతున్న ఇంకా తన సపరేట్ క్రేజ్ సంపాధించుకోవడంలో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి సుధీర్ బాబు కు అదృష్టం కలిసి రావడం లేదనే చెప్పాలి. ఈ హీరో ప్రస్తుతం " శ్రీదేవి సోడా సెంటర్ " అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టిజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మరి ఈ సినిమాతోనైనా సుధీర్ బాబు హిట్ కొట్టి స్టార్ హీరో స్టేటస్ కు చేరుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: