ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరో గా లైగర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్.. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో పాటుు ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ కి మంచి స్పందన దక్కింది..
ఇక పూరి జగన్నాథ్ పర్సనల్ విషయానికి వస్తే ఆయనకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.. కుమారుడు ఆకాష్ పూరి ప్రస్తుతం హీరోగా చేస్తుండగా కూతురు స్టడీస్ చేస్తోంది.. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కూతురు ఫోటో షూట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఇందులో హీరోయిన్ ని మించిన గ్లామర్ తో కనిపిస్తుంది పూరీ కూతురు పవిత్ర.. మరి తన అన్నయ్య లాగే ఆమె కూడా సినిమాల్లో కి వస్తుందో లేదో చూడాలి.. గతంలో ఈమె ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలోని హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది..