బాహుబలి స్టార్ ప్రభాస్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.  ఇప్పటికే ఆయన అరడజనుకు పైగా సినిమాలు లైన్ లో పెట్టాడు. అయినాసరే ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ మొదలు టాలీవుడ్ దాకా అనేక మంది దర్శక నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఆయన రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా ఆయన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.. ఈ సినిమాలు కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఒక భారీ బడ్జెట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ కూడా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.


ఇక ప్రభాస్ తో సినిమా చేయాలని దర్శకురాలు సుధా కొంగర ఈ మధ్యనే ఒక కథ వినిపించినట్లు గా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ కోసం తెలుగులో ఒక విలక్షణ దర్శకుడు కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు ఫీల్ గుడ్ సినిమాలు తీస్తాడనే పేరున్న చంద్రశేఖర్ ఏలేటి.


చూడడానికి ఫీల్ గుడ్ సినిమాలే అయినా ఇప్పటిదాకా ఆయన సినిమాలు కమర్షియల్గా వర్కౌట్ అయినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. అయినా సరే ఆయనతో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ కోరిక మేరకు చంద్రశేఖర్ ఏలేటి ఒక కధ సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. చివరిగా నితిన్ హీరోగా చెక్ అనే సినిమా చేశారు చంద్రశేఖర్ ఏలేటి. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా సరే ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకో లేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: