సూపర్ స్టార్ రజినీకాంత్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చాలా రోజుల పాటు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందారు.. ఆ తరువాత చెన్నై వెళ్లి పోయినా ఆయన ఈ మధ్యనే హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చారు.. అయితే ఆయన హైదరాబాద్ వచ్చిన పని పూర్తి అయినట్లు సమాచారం.. అన్నాత్తే సినిమా షూటింగ్ లో రజినీకాంత్ పోర్షన్ అంతా పూర్తి అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షూటింగ్లో ఉండగానే రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. 

హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ఆయనకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి మళ్ళీ మామూలు మనిషిని చేయగలిగారు.. అయితే ఆయన ఇప్పట్లో మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నరు ఏమో అని అందరూ భావించాడు.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హైదరాబాద్లో అన్నాత్తే షూటింగ్లో రజనీ కాంత్ పోర్షన్ అంతా పూర్తయినట్లు సమాచారం.. కేవలం రజినీకాంత్ చేయాల్సిన షూటింగ్ అంతా ముందుగా షూట్ చేసినట్లు చెబుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్ చెన్నై కూడా వెళ్ళిపోయారు అని తెలుస్తోంది.. 


ఇక కొద్ది రోజుల పాటు చెన్నైలో రెస్ట్ తీసుకొని ఆయన మళ్లీ ఫ్లైట్స్ మొదలయ్యాక అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ ఆయన కొద్ది నెలలపాటు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ అన్నాత్తే సినిమాలో కీర్తి సురేష్, నయనతార, ఖుష్బూ లాంటి సీనియర్ హీరోయిన్లు నటిస్తున్నారు. రజినీకాంత్ అనారోగ్యానికి గురికావడంతో వీళ్లందరి షెడ్యూల్స్ కూడా మార్చుకోవలసి వచ్చింది. ఇక ప్రస్తుతానికి తెలంగాణలో కూడా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా నిలిపివేశారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: