కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇటు సామాన్య ప్రజల నుంచి అటు సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిని కబళిస్తోంది. ఇక ఇప్పటికే మన తెలుగు స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు ఈ కరోనా బారిన పడగా, ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేటెడ్ తీసుకుంటూ, వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఇప్పుడు మరో టీవీ నటి బీనా ఆంటోనీ కూడా కరోనాతో హాస్పిటల్ లో చేరారని, ప్రస్తుతం వైద్యులు తనకు చికిత్స అందిస్తున్నట్లు ఆమె భర్త ,నటుడు అయిన మనోజ్ నాయర్ వెల్లడించారు..


బీనా మలయాళంలోని  టీవీ సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇటీవల ఈమె కరోనా బారిన పడడంతో ఆమె భర్త మనోజ్ ఒక వీడియో షేర్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. "నా జీవితంలో  అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఏదైనా  ఉంది  అంటే అది ఇదే సమయం .ఎందుకంటే రెండు రోజుల క్రితం బీనాకు కరోనా పాజిటివ్ వచ్చింది. షూటింగ్లో ఒక వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఆమె క్వారంటైన్ కి వెళ్ళింది. కానీ కొన్ని రోజుల తరువాత తనలో కూడా కోవిల్ లక్షణాలు కనిపించాయని చెబుతుండడం, క్రమంగా ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ చేర్పించాము.


కొవిడ్ పరీక్షలు చేయించిన్నప్పుడు యాంటీజెన్ టెస్టులో  నెగటివ్  వచ్చింది. కానీ ఆర్టీ పీసీఆర్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది. ఇక ఫలితాలు రాగానే వెంటనే వైద్యులు చికిత్స చేయడం ప్రారంభించారు. ఇక అంతే కాకుండా ఈమె నిమోనియా తో  బాధపడుతున్నట్లు కూడా గుర్తించిన వైద్యులు, తనని అక్కడినుంచి తీసుకెళ్ళమని చెప్పారు. ఐసీయూ  సదుపాయం వున్న మరో హాస్పిటల్ లో చేర్పించమని చెప్పడంతో నాలో భయం మొదలైంది. ఏం చేయాలో తోచలేదు. ప్రస్తుతం దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం కుదుటపడింది." అంటూ ఎమోషనల్ అయ్యాడు..

ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం. శానిటైజర్ ఎప్పుడు మీ వద్ద ఉంచుకోవడం. విందు, వినోదాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోమని" అతడు అభ్యర్థించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: