అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.. తన కెరీర్లో మొట్టమొదటిసారి అల్లు అర్జున్సినిమా కోసం డి గ్లామర్ రోల్ లో నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. 


ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్ పేరిట ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ చేయగా దానికి ఊహించనంత రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ చరిత్రలో చాలా వేగంగా 60 మిలియన్లకు పైగా సాధించిన ఈ టీజర్ తాజాగా మరో రికార్డు సాధించింది. అత్యంత వేగంగా 1.5 మిలియన్ లైక్స్ సాధించిన మొట్టమొదటి టీజర్ గా ఇది రికార్డులకెక్కింది.. ఇక అల్లు అర్జున్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.. 


చాలా రోజుల నుంచి వేరేచోట ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ ఈరోజు తన పిల్లలను కలిశారు. వీరందరూ కలిసి ప్రేమగా హత్తుకుంటుంది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘15 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నా. తగిన జాగ్త్రలు పాటించడంతో కొవిడ్‌ నెగెటివ్‌గా నిర్థారణ అయ్యింది. నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన అభిమానులకు, సన్నిహితులకు థ్యాంక్స్‌. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నా. అందరూ ఇంట్లోనే ఉండి ఆరోగ్యంగా ఉండండి’’ అని బన్నీ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: