తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నారు బోయపాటి శ్రీను. దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరాజాస్మిన్ హీరోయిన్ గా రూపొందిన భద్ర సినిమా ద్వారా దర్శకుడిగా తొలిసారిగా మెగాఫోన్ పట్టారు బోయపాటి శ్రీను. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో మురళీమోహన్, దివంగత నటుడు పద్మనాభం, ప్రదీప్ రావత్, అజయ్, ఝాన్సీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు చేశారు.

మంచి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పలు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు బోయపాటి ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. రిలీజ్ అనంతరం ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. మాస్ మహారాజా రవితేజ వండ్రఫుల్ పెర్ఫామెన్స్, హీరోయిన్ మీరాజాస్మిన్ ఆకట్టుకునే అందం అభినయం, ఆకట్టుకునే యాక్షన్ ఫైట్ సన్నివేశాలు, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యూటిఫుల్ సాంగ్స్ వండర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అద్భుతమైన ఫోటోగ్రఫీ విజువల్స్, ముఖ్యంగా అందరినీ ఆకట్టుకునే కథ, కథనాలు వెరసి భద్ర సినిమా ని అంత భారీ సక్సెస్ చేశాయి. ఇక ఈ సినిమాలో ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విలన్స్ దాడి చేసి ప్రకాష్ రాజ్ ని చంపే యాక్షన్ సీన్, అలానే తన మనసులోని బాధను దాచుకున్న హీరోయిన్, హీరో వాళ్ళ ఇంట్లో గడిపే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అర్జన్ బజ్వా పోషించిన రాజా పాత్ర ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉంటుంది. మొత్తంగా ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతో అలరించి సూపర్ హిట్ కొట్టింది.

ఇక ఈ మూవీ తర్వాత దర్శకుడు బోయపాటికి హీరోగా రవితేజ కి మంచి క్రేజ్ లభించడంతోపాటు మరిన్ని అవకాశాలు లభించాయి. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలై నేటికి సక్సెస్ఫుల్ గా 16 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పలువురు రవితేజ అభిమానులు నేడు ఈ మూవీ పేరుతో ఒక ట్రెండ్ సెట్ చేసి మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తూ తమ హీరో రవితేజ కి అలానే భద్ర మూవీ యూనిట్ కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఇటీవల క్రాక్ తో సక్సెస్ కొట్టిన రవితేజ ప్రస్తుతం ఖిలాడీ మూవీ చేస్తుండగా, బాలయ్య తో అఖండ అనే మాస్ యక్షన్ సినిమా చేస్తున్నారు బోయపాటి ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: