సాయి పల్లవి నటనకి, డాన్స్ కి ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన 'ప్రేమమ్' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి భామ. ఆ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగులో ‘ఫిదా’ సినిమా చేసింది.ఇందులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసేంది.ఆమెకు తెలుగులో ఒకటి రెండు సినిమాలు తప్ప అన్ని సూపర్ హిట్ సినిమాలే ఉన్నాయి.

ప్రస్తుతం ఈ నేచురల్‌ బ్యూటీ తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తుంది. రానా హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. నక్సలైట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.ఇక తాజాగా సాయి పల్లవికి బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఛత్రపతి హిందీ రీమేక్ సినిమాలో శ్రేయ పాత్రలో నటించనుందని తెలుస్తోంది.అయితే ఈ విషయం మీద ఇంకా ఆఫీషల్ గా ఎలాంటి వార్త బయటకి రాలేదు. బెల్లంకొండ హిందీలో తెలుగు చత్రపతి రీమేక్‌ సినిమాను v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని పెన్ మూవీస్ నిర్మిస్తోంది.ఈ సినిమాతో పాటు బెల్లంకొండ మరో రీమేక్‌లో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్‌ తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కర్ణన్ రీమేక్ రైట్స్‌ను బెల్లంకొండ సురేష్ కొన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో. కర్ణన్ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడు.

అయితే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ భారీ సినిమాలని చేస్తూ తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు.ఆయనకి ఇప్పటిదాకా ఒక్క సాలిడ్ హిట్ కూడా రాలేదు. ఈ ఛత్రపతి రీమేక్ తో ఆయన ఆ లోటుని తీర్చుకోవాలి అని అనుకుంటున్నారు.హిట్స్ కోసం రీమేక్ లని నమ్మకున్న బెల్లంకొండ ఎంతమేరకు విజయం సాధిస్తాడో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: