టాలీవుడ్ లో లో ఇప్పుడు కొత్తరకం ట్రెండ్ ఫాలో అవుతున్నారు అదే సినిమాలు చేయడం.. తాము నటించిన లేదా ఇతర హీరోలు నటించిన సినిమాలకు సీక్వెల్ చేయటం మన హీరోలకు ఎందుకో నచ్చుతుంది.. అందుకే కాబోలు ఆ తరహా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు మన హీరోలు.. అలా మన టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సీక్వెల్ సినిమాలు ఏవేవి ఈ సంవత్సరం రాబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా సీక్వెల్ ని అడివి శేష్ హీరోగా తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా ఓపెనింగ్ ఇటీవలే జరిగింది ... నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ సినిమా మంచి హిట్ ను సాధించగా ప్రస్తుతం చందు మొండేటి ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు.. త్వరలో రిలీజ్ కానుంది ఈ సినిమా.. వెంకటేష్,వరుణ్ తేజ్ ల  ఎఫ్ టు సినిమా సీక్వెల్ కూడా f3 కూడా ఈ సంవత్సరం రాబోతున్న సీక్వెల్స్ లలో ఎన్నో అంచనాలు ఉన్న సినిమా..

నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ బంగార్రాజు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. అడవి శేష్ నటించిన గూడచారి సినిమా సీక్వెల్ గూడచారి 2 కూడా ఈ సంవత్సరం  తెరకెక్కబోయే సినిమాలలో ఈ సంవత్సరం తెరకెక్కబోయే ఆసక్తికరమైన సినిమాలలో ఒకటి.. ఇటీవలే రిలీజ్ అయిన సెన్సేషనల్ హిట్ గా మారిన చిన్న సినిమా జాతిరత్నాలు కు ఇప్పటికే సీక్వెల్ ప్రకటించారు దర్శకుడు అనుదీప్.. దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న కేజీఎఫ్ 2 ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతుంది.. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రాబోతున్న ఢీ&ఢీ,  రవితేజ క్రాక్,  జాంబి రెడ్డి సినిమాల సీక్వెల్ లు ఈ సంవత్సరమే రాబోతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: