టాలీవుడ్ యంగ్ హీరోల్లో అఖిల్ అక్కినేని కూడా ఒకడు. 2015 లో విడుదలైన ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అనుకున్న స్థాయి హిట్ అందుకోలేక పోయాడు. అయితే అంతకుముందు ఏడాది మనం సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఆ తర్వాత మరిన్ని సినిమాలు చేసినా స్టార్ హోదాను మాత్రం దక్కించుకోలేకపోయాడు. అయితే హెల్లో, మిస్టర్ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చేస్తున్నాడు.


 అయితే ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే అఖిల్ మరో సినిమాను ఓకే చేశాడు. అఖిల్ తాజా చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో అక్కినేని అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇస్తానని సురేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఏజెంట్’ అనే పేరు ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాల చిత్రీకరణ నిలిచిపోయాయి. ఈ సమయాన్ని కుర్ర దర్శకులు సరికొత్త తరహాలో వినియోగించుకుంటున్నారు.


 ఇటీవల మారుతి తన తాజా సినిమా పక్కా కమర్షియల్ సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా తన తదుపరి సినిమా ఏజెంట్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పలు చేస్తున్నాడట. ఇందుకోసం కొందరు రచయితలను ఎంచుకొని సినిమా కథను మరింత అద్భుతంగా రూపొందిస్తున్నారట. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన అఖిల్సినిమా కోసం తన లుక్స్‌ను పూర్తిగా మార్చేశాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన కొత్త హీరోయిన్ సాక్షి వైద్య నటించనుంది.


 ఈ సినిమాను ఏక ఎంటర్‌టైన్మెంట్స్, సురేంధర్ 2 సినిమా బ్యానర్లపై అనిల్ సుంకర, సురేంధర్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్, సురేందర్ రెడ్డి మొదటి సారి కలవబోతున్నారు. ఈ చిత్రంలో అఖిల్ అండవర్ కవర్ ఏజెంట్‌గా కనిపించనున్నాడట. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ ఆశించిన విజయం అందుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: