నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్నా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా నాని కెరీర్లోనే భారీ బడ్జెత్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా టాలీవుడ్‌లో నాని రేంజ్‌ను అమాంతం పెంచేస్తుందని ఫ్యాన్స్ టాక్. అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే వాయిదా పడింది. అయితే చిత్ర బృందం మాత్రం అప్పుడప్పుడూ సినిమాకు సంబంధించిన సర్ప్సైజింగ్ అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో మరింత క్రేజ్ పెంచుతోంది. తాజాగా విడుదలైన నాని, సాయి పల్లవి ఫస్ట్ లుక్ అప్‌డేట్స్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి సరికొత్త వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో నాని డిటెక్టివ్ పాత్రలో నటించబోతున్నాడట.

శ్యామ్ సింగరాయ సినిమాలో నాని తన కెరీర్లోనే తొలిసారిగా ఓ విలక్షణమైన డిటెక్టివ్ పాత్రలో నటించబోతున్నాడట. ఇదో కామెడీ అండ్ థ్రిల్లింగ్ డిటెక్టివ్ స్టోరీ అని, 'షెర్ లాక్ హోమ్స్' సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటించిన 'డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి' సినిమాల తరహాలో ఈ చిత్రం కూడా ఉంటుందని సమాచారం. అయితే నాని క్యారెక్టర్ కూడా కామెడీగానే ఉంటుందా..? లేక సీరియస్‌గా ఉంటుందా..? అనేది చూడాలి.

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయిపల్లవి మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ నానికి లవ్ ఎట్రాక్షన్ మాత్రం కృతి శెట్టితోనే ఉంటుందని టాక్ నడుస్తోంది. శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ఎక్కువ భాగం కలకత్తాలో జరిగింది. దీని కోసం హైదరాబాద్ పరిసరాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేశారు. ఇత బడ్జెట్ నాని సినిమాకు ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని సమాచారం.

కాగా.. ఈ సినిమాలో ఇందులో జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జంగా సత్యదేవ్ ఈ చిత్రానికి కథ అందించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: