దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాని వల్ల ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఎన్టీఆర్‌ పులితో చేసే ఫైట్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌ అన్న ప్రచారం జరిగింది. తరువాత ఇంటర్వెల్‌ బ్లాక్‌లో రామ్‌ చరణ్ యాక్షన్‌ ఎపిసోడ్ గూజ్‌బంప్స్ తెప్పిస్తుందన్న టాక్‌ వినిపించింది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ చివరిదశలో ఉండటంతో సినిమా గురించి ఏ చిన్న వార్త తెలిసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక్కక్క సీన్ గురించి చాల అప్డేట్స్ వచ్చాయి.

అయితే వీటి మీద జూనియర్ ఎన్టీఆర్ ఈ మద్యనే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు. ఈ సినిమాలో ఒక్కక్క యాక్షన్ సీన్ ప్రేక్షకులతో విజిల్స్ వేపిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి వావ్ అనకుండా ఉండరు అని ఎన్టీఆర్ అన్నారు.అలాగే ఈ సినిమాని డైరెక్ట్ ఓటిటి లో విడుదల చేసే ప్రసక్తి లేదు అని ఇలాంటి సినిమాలు థియేటర్స్ లోనే కూర్చొని చూడాలని ఆయన అన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంచెం ఉందని ఈ కరోన తగ్గిన వెంటనే షూటింగ్ మొదలవుతుంది అని ఎన్టీఆర్ చెప్పారు.

ఇక ఆయన ఈ సినిమా తర్వాత అన్ని సినిమాలని పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేస్తాను అని ప్రకటించారు. ఇక ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.ఇక ఈ సినిమాలో అలియా భట్ ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డీవీవి దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం లో రాబోతున్న ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నిషన్స్ సైతం పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: