ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతిశెట్టి. నిజానికి ఉప్పెన సినిమా రిలీజ్‌కు ముందు పోస్ట‌ర్స్ చూసే కృతికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక సినిమా విడుద‌లైన త‌ర్వాత ఆ క్రేజ్ పెరిగిపోయింది. ప్ర‌స్తుతం నాని హీరోగా తెర‌కెక్కుతున్న శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం చేతినిండా అవ‌కాశాల‌తో ఫుల్ బిజీగా ఉన్న కృతి శెట్టి తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని అందరూ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.మరోవైపు తమిళ చిత్రసీమలో ధనుష్‌ సరసన నటించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలకు సంతకం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బేబమ్మ కాల్షీట్లు ఖాళీగా లేవు.

ఈ సమయంలో వినూత్న చిత్రాల దర్శకుడు తేజ తన కొత్త సినిమా కోసం కృతీ శెట్టిని సంప్రదించాడట.దగ్గుబాటి అభిరామ్‌ వెండితెర అరంగ్రేటం చేయనున్న సినిమాలో బేబమ్మ నటిస్తే ప్లస్‌ అవుతుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. కానీ చేతిలో ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ఉండటంతో తేజ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. అయితే తేజ తన సినిమాల్లో హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండేలా జాగ్రత్తపడతాడు.అలాంటి దర్శకుడు సినిమా ఛాన్స్ ని క్రితి వదులుకోవడంపై ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.ఇక క్రితి  ఇటీవల స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ అనంతరం పూరి మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు టాక్ వస్తోంది. అందులో యష్ హీరో అని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.

అలాగే నితిన్ తో కూడా ఒక సినిమాకు కమిటీ అయినట్లు టాక్. ఈ రెండింటిలో ఎదో ఒక సినిమాకు కృతి శెట్టి హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు టాక్.ఇక వచ్చే రెండు మూడు సంవత్సరాలలో క్రితి శెట్టి ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్ ని దాటేసి నెంబర్ వన్  అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: