అయితే ఆ తరువాత కొద్ది రోజులకు రజిని అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో మళ్ళీ " అన్నాత్తే " షూటింగ్ నిలిచిపోయింది. ఇక రజిని అనారోగ్యం నుండి కోలుకున్న తరువాత " అన్నాత్తే " షూటింగ్ ను పరుగులు పెట్టించాడు. ఇక గత నెల ప్రారంభంలో కీలక షెడ్యూల్ ను హైదరబాద్ లో ప్రారంభించింది చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ లో కొన్ని భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించినట్లు సమాచారం. తాజాగా హైదరబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసిన రజిని తిరిగి చెన్నై బయలు చేరారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో సినిమా చిత్రీకరణ దాదాపుగా 80శాతం పూర్తి అయినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను సన్ పిక్షర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. కుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక గత కొంత కాలంగా సూపర్ స్టార్ ఖాతాలో సరైన విజయం లేక పోవడంతో ఈ సినిమాపై రజిని అభిమానులు భారీ ఆశాలే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతోనైనా సూపర్ స్టార్ తన స్థాయికి తగ్గ విజయం అందుకుంటాడో లేదో చూడాలి.