టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం అత్యద్భుత ఖర్చుతో ఎంతో అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ అన్నిటికంటే అగ్ర నిలుస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. తొలిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం, అలానే బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత రాజమౌళి నుండి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక విదేశాల్లోని ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుండడం విశేషం.

దాదాపుగా రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎంతో భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలను నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ప్రముఖ పత్రికకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ అనేది ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలోనే ఎంతో భారీ హైప్ తో రాబోతున్న సినిమా అని, అందుకే యూనిట్ మొత్తం కూడా దీనిని ఒక యజ్ఞంలా తీసుకుని ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని అన్నారు.

ఇక ఈ సినిమా ఒటిటిలో విడుదల కానుంది అంటూ ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు రాగా, దానిపై స్పందించిన ఎన్టీఆర్ అదంతా ఒట్టి పుకారు మాత్రమే అని, అయినా బాహుబలి, అవెంజర్స్, అవతార్ వంటి సినిమాలని మనం సినిమా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసినంతగా ఒటిటి లో ఎంజాయ్ చేయలేమని, అలానే ఇంత భారీ సినిమాని తమకి ఒటిటిలో రిలీజ్ చేసే ఆలోచన లేదని, అవకాశం ఉన్నంతవరకు అనుకున్న టైం కె మూవీ విడుదలవుతుందని, ఒకవేళ ప్రస్తుత కరోనా పరిస్థితులు మరికొన్నాళ్లు కొనసాగిన పక్షంలో సినిమా వాయిదా పడితే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం అని అన్నారు ఎన్టీఆర్ ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: