కాగా మిగతా సినిమా పరిశ్రమలతో పోలిస్తే తెలుగులో మాత్రం సీక్వెల్స్ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. గతంలో జేడీ చక్రవర్తి, చిన్న ల కలయికలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మనీ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టగా దాని తర్వాత వచ్చిన మన మనీ మాత్రం ఘోరంగా విఫలమైంది. ఇక ఇటీవల దానికి కొనసాగింపుగా వచ్చిన మనీ మనీ మోర్ మనీ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అలానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంత్ దర్శకత్వంలో రూపొందిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టగా దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ గా నిలవగా దాని సీక్వెల్ గా తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా టాలీవుడ్ లో సీక్వెల్స్ గా విడుదలై చాలావరకు పరాజయాలను మూటగట్టుకున్నాయి. అయితే టాలీవుడ్ లో సీక్వెల్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న సినిమాల్లో బాహుబలి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. బాహుబలి సిరీస్ లో మొదటి భాగాన్ని మించేలా రెండో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించి గొప్ప విజయాన్ని అందుకున్నారు దర్శకుడు రాజమౌళి.