నిజానికి ఇటీవలి కాలంలో మల్టీసర్టారర్ సినిమాలకు బీజం వేసింది మహేశ్ బాబు, వెంకటేశ్. వీరిద్దరూ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత టాలీవుట్లో మల్టీస్టారర్లకు డిమాండ్ మొదలైంది. ఆ తర్వాత మళ్లీ వెంకటశ్-పవన్ కల్యాణ్ జోడీగా వచ్చిన గోపాల గోపాలతో టాలీవుడ్లో మల్టీస్టారర్లలకు సూపర్ క్రేజ్ వచ్చింది.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్, మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. కరోనా పరిస్థితులు కాస్త చక్కబడ్డ తర్వాత సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రేక్షకుడు కోరకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మరి ఈ మల్టీస్టారర్ కాంబో ఎంతలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.