ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. తమ అభిమాన హీరోలను ఒకే తెరపై చూడడం, వారిద్దరూ కలిసి యాక్షన్ సీన్లు, సెంటిమెంట్ సీన్లు చేస్తుంటే తెగ సంతోష పడిపోవడం ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో బడా దర్శక నిర్మాతలు కూడా వీటిపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇక సీనియర్ హీరోల్లో కొంతమంది, జూనియర్ హీరోల్లో కొంతమంది కూడా ఈ మల్టీస్టారర్లపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో వరుసగా మల్టీస్టారర్లు సెట్స్‌పైకి వెళుతున్నాయి.

నిజానికి ఇటీవలి కాలంలో మల్టీసర్టారర్ సినిమాలకు బీజం వేసింది మహేశ్ బాబు, వెంకటేశ్. వీరిద్దరూ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత టాలీవుట్‌లో మల్టీస్టారర్లకు డిమాండ్ మొదలైంది. ఆ తర్వాత మళ్లీ వెంకటశ్-పవన్ కల్యాణ్ జోడీగా వచ్చిన గోపాల గోపాలతో టాలీవుడ్‌లో మల్టీస్టారర్లలకు సూపర్ క్రేజ్ వచ్చింది.


ఇక 2019లో వెంకటేశ్-వరుణ్ తేజ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్2 మల్టీస్టారర్ రేంజ్‌ను అమాంతం పెంచేసింది. దీంతో ఇప్పుడు అనేకమంది డైరెక్టర్లు కూడా ఇద్దరూ హీరోలతోనే కథలు రెడీ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో సూపర్ కాంబో మల్టీస్టారర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అదే హీరో గోపీచంద్, సీనియర్ హీరో రాజశేఖర్. అవును వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోందట.

 యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్‌, మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంది. శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. కరోనా ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ప్రేక్షకుడు కోరకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. మరి ఈ మల్టీస్టారర్ కాంబో ఎంతలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: